Listen to this article

మాజీ మ్మెల్సీ రాములు నాయక్,

జనం న్యూస్, మే 14,కంగ్టి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని బంజారా ఆలయల ధూప దీప నైవిద్యాలకై,ఆలయ అర్చకులకై,ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,బంజారా సంఘం పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బంజారా తాండలలోని మందిరంలో పూజలు నిర్వహించే అర్చుకులు పూజారులు ధూప దీప నైవేద్యాలుకు ఆలయ అర్చకులకు ప్రభుత్వ వేతనం కొరకు ప్రతి ఒక్క పూజారి అప్లై చేసుకోవాలని అన్నారు. 2025/05/24 తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని అన్నారు.గతంలో కొన్ని తాండల పూజరులకు మాత్రమే వచ్చాయని, వారు రినివల్ చేసికోవాలని,అలాగే కొత్తవి అప్లై చేసుకోవాలని మాజీ మ్మెల్సీ తెలంగాణ రైతు కమిషన్ మెంబెర్ రాములు నాయక్ అన్నారు.2025/05/20,తేదీన పూజారులు నారాయణ ఖేడ్ హనుమనతప్ప వెంచర్కు వచ్చి ఫాన్స్ ఇవ్వాలని కోరారు. పూజారులు,తమ గుడి ఫోటోలు రెండు, అర్చకుని ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫామ్ నంబర్ 43 ని అప్లికేషన్ నింపి జిరాక్స్లతో ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో దిశ కమిటీ మెంబెర్ ప్రకాష్ రాథోడ్,నారాయణ, సురేష్,బాబు,శేసేరావ్ పూజారులు,బంజారా సహోదరులు పాల్గొన్నారు.