Listen to this article

జనం న్యూస్ మే 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవీఎంసీ మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావును మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున డివి సుబ్బారావు తర్వాత రెండవ మేయర్ గా శ్రీనివాసరావు అధిష్టానం చాలా బాధ్యతను అప్పగించిందని, నాలుగు సంవత్సరాలు వైసిపి పాలనలో జీవీఎంసీని అధోగతి పాలు చేసి అభివృద్ధి నిరోధకులుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రిషికొండ ను నాశనం చేసి 500 కోట్లు ఖర్చుపెట్టి పనికిరాని పాలసీలు కట్టారని, ఉపయోగపడే విధంగా కట్టలేదని జగన్ రెడ్డి నివాసంగా నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ముఖ్యంగా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కృతనిత్యంతో ఉన్నారని, రానున్న రోజుల్లో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ అన్ని జోన్ లో పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా శ్రీనివాసరావు కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని నాగ జగదీష్ అన్నారు.