Listen to this article

జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

నారాయణపురంలో సుమారు 160 కుటుంబాలు మంగళవారం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. టీడీపీ నాయకుడు పైడి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు నచ్చి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.