Listen to this article

జనం న్యూస్ 14 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ జంక్షన్‌ సమీపంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంతో నగరంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే తొలగించిన స్థానంలోనే ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని అధికారులు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.