Listen to this article

సర్పంచ్ ఎన్నికలలో ఏ రిజర్వేషన్ వస్తుందని ఆందోళన

జనం న్యూస్ 14 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

తెలంగాణలో గ్రామపంచాయతి ల నిధుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పాలకమండలి గడువు ముగసి ఏడాది అవుతుంది పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ ఉండడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయే పరిస్థితిలు ఏర్పడుతుంది.గత ఏడాది ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో పంచాయతీలకు కేంద్రం నుంచి 1,514 కోట్లు రూపాయలను కేటాయించింది. కానీ పంచాయితీలో పాలకవర్గం ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెప్తున్నాయి.దీనితో ఏడాదిగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.అయితే ఈ ఆర్థిక సంవత్సరం నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ అవుతాయా అన్న ప్రశ్నలు ఉప్పన్నమవుతున్నాయి.ప్రత్యేక అధికారితో పల్లెలలో పాలన నడుస్తున్న అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో పల్లెల్లో ఉన్నాయి. మరోవైపు ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహుల్లో ఏ రిజర్వేషన్లు వస్తాయని టెన్షన్ నెలకొంది.