Listen to this article

పెదోడికి ఒక న్యాయం, బడాబాబుకులకు ఒక న్యాయం.

జనం న్యూస్, ఏప్రిల్14,జూలూరుపాడు:

మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురవుతోందు. గిరిజన, గిరిజనేతర పేదలు మనుగడ కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళితే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అడ్డుకొని, పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.కానీ కొందరు బడాబాబులకు మాత్రం ఆయా శాఖలకు చెందిన అధికారులు కొందరు వత్తాసు పలుకుతున్నారు అని గ్రామీణ పేదల సంఘం, ఆదివాసీ నాయకులు బచ్చల లక్ష్మయ్య ఆరోపించారు .ఈ సందర్భంగా బచ్చల లక్ష్మయ్య మాట్లాడుతూ జూలూరుపాడు మండలం, గుండెపుడి రెవెన్యూ సర్వే నెంబర్ 117లో కొంత సీలింగ్ భూమిని, ప్రభుత్వ భూమిని గిరిజన ప్రాంత చట్టాలను ఉల్లంఘిస్తూ పథకం ప్రకారం ఒకరిద్దరి వ్యక్తుల పేరుమీద అక్రమంగా పట్టాలు చేశారని,అక్రమంగా సీలింగ్ భూములు కాజేసి, అట్టి భూముల్లో పెద్ద ఎత్తున పైరవీలు చేసి, పరపతి ఉపయోగించి బినామీల పేరుతో అక్రమ మార్గాన మైనింగ్ అనుమతులు తీసుకొచ్చారని. అంతేకాకుండా గత రెండు నెలల కాలంగా కాజేసిన సీలింగ్ భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో గుట్టలను తవ్వుతున్నారని. టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారని, కొంతమంది ముఠాగా తయారై ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా దందా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికయినా ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి సీలింగ్ భూమిని, ప్రభుత్వ భూమిని పట్టా చేసిన విషయం తేట తెల్లమవుతోందని. సీలింగ్ భూమి, ప్రభుత్వ భూమి ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు చేయటం, గుట్టలను తవ్వి ప్రకృతిని విధ్వంసం చేయడం వంటి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు విరుద్ధంగా సీలింగ్, ప్రభుత్వ భూములను ఆక్రమించి మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్న వ్యక్తులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాను పేర్కొన్నారు.