

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించినారు స్వామివారికి విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యా వచనము ద్వాదశ ఆరాధనలతో వివిధ రకాల పుష్పాలతో పుష్ప యాగాన్ని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవల్లి వేణుగోపాలాచార్యులు వేదమంత్రాలు మధ్య నిర్వహించినారు మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేద పారాయణాలను చేసుకుంటూ దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఊరేగించారు ఒక్కొక్కసారి ఒక్కో వాయిద్యంతో 12 రకాల వాయిద్యాలతో 12సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పండిత సన్మానం చేసినారు పండిత సన్మానంతో శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సైనా రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి శివరామకృష్ణ రెడ్డి మనీష్ రెడ్డి కందగట్ల కోటేశ్వరరావు సామల రవీందర్ కుసుమ శరత్ బాబు దిండిగాల వంశీ కాంబత్తుల ప్రకాష్ భాషని వెంకటేశ్వర్లు నామని శివ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….