Listen to this article

జనంన్యూస్ 16. సిరికొండ.ప్రతినిధి.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్ట ఎరువు అయిన జీలుగా విత్తనాలు సిరికొండ మండలములోని సొసైటి లలో అందుబాటులో ఉన్నవి. Pacs సిరికొండ పరిధిలోని 600 బస్తాలు , ప్యాక్స్ తుంపల్లి పరిదిలో 300 బస్తాలు మరియు పాక్స్ గడ్కోల్ పరిదిలో 100 బస్తాలు అందుబాటులో ఉన్నవి, జిలుగును 17/05/2025 శనివారం రోజున రైతులకు పంపిణీ చేయడం జరుగును. రేపు ఉదయం 10 గంటలకి పాక్స్ సిరికొండ పరిది రైతులు రైతు వేదిక సిరికొండ వద్దకి రైతు భూమి పాస్ బుక్ మరియు ఆధార్ కార్డు జీరాక్స్ తీసుకొని పర్మిట్ తీసుకోవాలి. పాక్స్ తుంపల్లీ పరిధిలోని రైతులు పాక్స్ తంపల్లి వద్ద జిలుగా విత్తనాలు తీసుకోవాలి. 30 kgs బస్తా 50% సబ్సిడీ ద్వారా ధర 2137.50 ఉన్నది.