Listen to this article

రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్

జనం న్యూస్,మే 16,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని వ్యవసాయదారులకు నీటి ప్రాముఖ్యతను వివరిస్తున్న వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టుని మనం మన పొలంలోనే నీటిని కుంటలు,కందకాల నిర్మాణాలతో దాచుకుంటే భవిష్యత్తులో ఆ నీటిని వివిధ రకాలుగా మనము సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ తన క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన కల్పించారు.కంగ్టి మండల ప్రాంతంలోని రైతులు బోరు బావులు తవ్వి చాలా వరకు భూగర్భంలో నీళ్ళు లభించక పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.ఇలా బోరు భావులపై ఆధారపడకుండా, రైతులు తమ పొలం లోతట్టు ప్రాంతాల్లో అనుకూలమైన సైజుల్లో నీటి కుంటల నిర్మాణాన్ని నిర్మించుకుంటే వానాకాలంలో కురిసే ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టుకొని మన పొలంలో ఇంకే విధముగా చేసుకుంటే భవిష్యత్తులో భూగర్బ జలం పెరగడంతో పాటు నీటి కుంటలో నిలువ ఉన్న నీటితో పంటకు నీరు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. నిలువ ఉన్న నీటిలో చేపల పెంపకంతో అదనపు ఆదాయం కూడా ఆర్జించే అవకాశం కూడా ఉందని వ్యవసాయ విస్తీర్ణధికారి రైతులకు వివరించారు.