

జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య జోగులాంబ గద్వాల్ జిల్లా – మానవపాడు మండల కేంద్రానికి చెందిన బొంకురు శేఖర్ రెడ్డి (32) తన ఆరెకరాల్లో పొగాకు, మిర్చి, కంది వేశాడు.. సాగునీరు సరిగా అందక దిగుబడి తగ్గింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో రూ.8 లక్షల దాకా చేసిన అప్పులు మీదపడ్డాయి. కంది కొనుగోళ్లకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో విక్రయించినా కనీసం పెట్టుబడి కూడా రాలేదు.దీంతో ఇంకా అప్పుల ఊబిలో కురుకుపోతానేమోనన్న భయంతో పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడుసంగెం మండలం పోచమ్మతండా పంచాయతీ పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన బానోత్ తిరుపతి (39) తనకున్న ఎకరన్నర, కౌలుకు తీసుకున్న నాలుగెకరాల భూమిలో పత్తి, మక్క సాగు చేశాడు. దీంతో అతడికి సుమారు రూ.8 లక్షల దాకా అప్పయింది. పంటలు సరిగ్గా పండక, దిగుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగు ఆత్మహత్య చేసుకున్న రైతువికారాబాద్ – దోమ మండలం అయినాపూర్కు చెందిన బ్యాగరి యాదయ్య(35)కు అరెకరం పొలం ఉన్నది. ఇందులో కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూ.రెండు లక్షల అప్పు చేసి నాలుగు బోరు బావులు వేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు పంట పెట్టుబడి కోసం కొడంగల్లోని ఓ బ్యాంకులో మరింత అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో పొలానికి వెళ్లి చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రుణమాఫీ జరగక మరో రైతు బలి జగిత్యాల – ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లింగన్న పేరిట రూ.80 వేలు, అతడి భార్య పేరిట రూ.1.50 లక్షల పంట రుణం ఉన్నది. రూ.2.30 లక్షల రుణం మాఫీ అయ్యే అవకాశం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.. ఇప్పటికే వ్యవసాయ భూమి కొనుగోలు, పంట పెట్టుబడి కోసం దాదాపు రూ.15 లక్షల దాకా అప్పు చేసిన లింగన్న, రూ.2లక్షల రుణమాఫీ కూడా కాకపోవడంతో మనోవే