Listen to this article

జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అక్రమంగా నిలవచేసిన ప్రేలుడు పదార్ధం కారణంగా గతంలో కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలో పెనుప్రమాదం సంభవించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లింది! మావోయిస్టులకు కూడా ప్రేలుడు పదార్ధాలు ఇక్కడి నుండే అమ్మకం అవుతుంటాయని జనం అనుకుంటుంటారు. జిలెటిన్ స్టిక్సు, ప్రేలుడు పదార్ధాలను క్వారీలకు ప్రభుత్వ అనుమతితో విజయనగరంలో విక్రయిస్తుంటారు. ఈ తరహా వ్యాపారం చేసేవారు కొందరు ఉగ్రవాదులకు ప్రేలుడు పదార్ధాలు సరఫరా చేయడానికి అవకాశముంది? ఇటీవల విజయనగరం, హైదరాబాదులలో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదులు విజయనగరంలోనే ప్రేలుడు పదార్ధాలు కొనుగోలు చేసారని వార్తలు వెలువడడం గమనార్హం! Be alert…!