Listen to this article

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని ఎస్ వి వి కే ఫంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల కార్యకర్తల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించినా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలుపుతూ వివిధ గ్రామాలకు చెందిన 37 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు మొత్తం రూపాయలు 16.70.000 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు జీవితాల్లో వెలుగులు నింపుతుంది అన్నారు ఆపదలో ఆపద్బాంధులా ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పద్మశాలి రాష్ట్ర మినిమం వేజేనెస్ అడ్వైజరీ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ పత్తి పాక మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి పెద్ద కోడాపాక మాజీ సర్పంచ్ అబ్బుప్రకష్ రెడ్డి నాయకులు చిందం రవి బాసాని మార్కండేయ మహమ్మద్ హైదర్
పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు….