Listen to this article

జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. విజయనగరంలో IED బాంబ్‌ పేలుడికి సిరాజ్‌ సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. తన ఫ్రెండ్‌ సమీర్‌తో కలిసి కుట్ర పన్నినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు, రాకెట్‌ లాంఛర్ల తయారీ అవసరమైన సామాగ్రిని శనివారమే కొనుగోలు చేసి ఐఈడీ తయారీకి సిద్ధమైనట్లు సమాచారం.