

జనం న్యూస్. మే 21. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. బుధవారం
రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంముందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.టిపిసిసి సెక్రెటరీ షేక్ అబ్దుల్ ఘనీ, శ్రీనివాస్, ఎమ్మెస్ రావు, మొయినుద్దీన్, తాజ్, సయ్యద్ ఇర్ఫాన్, కాసిం, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
