Listen to this article

జనం న్యూస్ మే 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే రహదారిలో ఏర్పడిన గుంతల వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని నిన్న సిపిఎం పార్టీ ఆధ్యర్యంలో రాస్తా రోకో చేయడం జరిగింది,రహదారి పై ఏర్పడిన గుంతల పైగా ఆ రహదారి పైనే నీళ్ళు నిలవ ఉండడం వలన నడక తో వెళ్ళే వారు సైతం ఇబ్బంది పడి వేళ్ళసి వచ్చేది రహదారిలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని చేసిన రాస్తా రోకో కు జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఈ రోజు ఆ గుంతలను పూడ్చడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం.దినకర్ మండల బాధ్యులు కార్తీక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు