

జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి.
కర్రేగుట్టలో ప్రజలపై యుద్ధం అపి శాంతి చర్చలు జరపాలి.
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్.
కార్పొరేట్ల కు అటవీసంపద అప్పగింతకే మావోయిస్ట్ లు, ఆదివాసులపై కేంద్రం యుద్ధం ప్రకటించి మరి ఎన్ కౌంటర్ లు, అణిచివేతలు చేపట్టిందని, మావోయిస్ట్ లు, గిరిపుత్రులపై కాల్పులు ఎవరికోసం చేస్తున్నారో తెలుపాలని, కర్రేగుట్టలో ప్రజలపై యుద్ధం అపి శాంతి చర్చలు జరపాలని.సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు సిరికొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు: ఛత్తిస్ ఘడ్ అడవుల్లో ఉన్న అటవీ సంపదను ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ల కు అప్పగించడానికి అక్కడ అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆడవి బిడ్డలు అయినా ఆదివాసులు, వారి కోసం పని చేస్తున్నా మావోయిస్ట్ లను లక్ష్యంగా చేసుకొని కేంద్రం ప్రభుత్వం నిస్సిగ్గుగా “ఆపరేషన్ కగార్” చేపట్టి యుద్ధవాతావరణం సృష్టించి గిరిపుత్రులను, సీపీఐ(మావోయిస్ట్) పార్టీ నేతలు మరియు కార్యకర్తలను భూటకపు ఎన్ కౌంటర్ చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాంగంప్రకారంగా, చట్టభద్ధంగా పని చేస్తున్నాం అని నీతులు చెప్పే కేంద్రప్రభుత్వం బహటంగా అక్కడి వారిపై డెడ్ లైన్ విధించి కాల్పులకు పాల్పడడం వారిలో ఉన్న కపట ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు. అందులో భాగంగానే అనారోగ్యంతో వైద్యం పొందుతున్న సీపీఐ(మావోయిస్ట్) పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల. కేశవరావ్ ను పట్టుకొని కర్రేగుట్టాల్లో కాల్చిచంపి ఎన్ కౌంటర్ కథలు అల్లుతున్నారన్నారు. మన దేశపౌరులను అమానుషంగా చంపిన పరదేశంపై యుద్ధంకు “సీజ్ పైర్” అని, స్వదేశం పౌరులపై మానవత్వం మరిచి భూటకపు ఎన్ కౌంటర్స్ కు పునుకోవడం శోచనీయం అన్నారు. మావోలు శాంతి చర్చలకు సిద్ధం అని కాల్పులకు విరామం ప్రకటించిన కేద్రం ప్రభుత్వం కర్రేగుట్ట అడవులనే లక్ష్యం కాబట్టి ఏరివేతనే ఎంచుకోవడం ఎం ప్రజాస్వామికం అన్నారు. దేశ పౌరులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు కేంద్రం అణిచివెతను ఖండించాలని, వ్యతిరేకంగా కేంద్రం దేశపౌరులపై చేపట్టిన అధర్మ యుద్ధనికి వ్యతిరేకంగా నిలబడాలి అని, కేంద్రం పై ఒత్తిడి తేవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు బి. కిశోర్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం. లింబాద్రి,ఇ.రమేష్, ఎస్. కిశోర్, ఎల్. నరేష్, జి. రవితదితరులు పాల్గొన్నారు.