

జనం న్యూస్ 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ విభాగాలను ప్రారంభించిన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లోనీ ప్రసాద్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు అత్యాధునిక వైద్య విభాగాలైన ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ యూనిట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు యూనిట్లను ప్రారంభించి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రత్యూష చౌదరి మాట్లాడుతూ… “ప్రజలకు అధునాతన వైద్యం అందించేందుకు మా ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో అందిస్తున్నామని, ప్రజారోగ్యం కోసం మా సేవలు విస్తరిస్తూ నేడు ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ విభాగాలను ప్రారంభించుకున్నామన్నారు. ఈ కొత్త విభాగాల ప్రారంభంతో పేషెంట్లకు నిర్దిష్ట, ఖచ్చితమైన పరీక్షల సౌకర్యం లభించనుండగా, నగరంలోని ఆరోగ్య సేవల శ్రేణిలో ప్రసాద్ ఆసుపత్రి మరింత ముందుకు సాగనుందని ప్రత్యూష తెలిపారు.. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కపిల్ తేజస్వి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు