Listen to this article

జనం న్యూస్ మే 23 నడిగూడెం

ప్రస్తుత వేసవిలో ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని నడిగూడెం కు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. శుక్రవారం రామాపురంలో భుసార పరీక్షలుపై నిర్వహుంచిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మట్టి నమూనా తీసే విధానం పై రైతులకు వివరించారు. ఆలాగే భుసార పరీక్షల ఫలితాలను బట్టి నేలలోని సేంద్రియ కర్బనం పెరగాలంటే పచ్చి రొట్ట పంటలు సాగు చేసుకోవాలని, పశువుల ఎరువు వేసుకోవాలని వివరించారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యమని పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు రైతులు పాల్గొన్నారు.