

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు యువతను మాదక ద్రవ్యాల బానిసత్వం నుండి రక్షించేందుకు, ఉపాధ్యాయులను చైతన్యపరచడం లక్ష్యంగా, శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల మధ్యంతర శిక్షణ కార్యక్రమంలో మునగాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎస్సై ప్రవీణ్ పాల్గొని ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాలు (డ్రగ్స్) మరియు వాటి వినాశకర ప్రభావాల గురించి వివరిస్తూ, విద్యార్థులు వాటి బారిన పడకుండా ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్తలు, గుర్తించాల్సిన అసాధారణ ప్రవర్తనలు మరియు సమయానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రమైన అవగాహన కల్పించారు.ఈ అవగాహన కార్యక్రమం ఉపాధ్యాయుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై స్పష్టత కలిగించి,భవిష్యత్తులో యువతను తప్పుదారుల్లోకి వెళ్లకుండా కాపాడేందుకు ఉపయుక్తంగా నిలిచింది.