

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
వచ్చే నెల ఒకటి నుండి ప్రతి రేషన్ షాప్ వద్ద బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై కూర్మారావు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.పేదలకిచ్చే బియ్యం రేషన్ డిపోలవద్ద రేషన్ షాపులవద్ద నరేంద్రమోదీ పోటో తప్పక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనాకష్టకాలంనుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగి నిరుపేదలు మధ్యతరగతి,కుటుంబాలకు అర్హులందరకీ తలకొక్కంటికి 5కేజీల చొప్పున ఇస్తున్నారని పేర్కొన్నారు . ఈ రేషన్ బియ్యం గత వైసీపీ ప్రభుత్వంలో పక్కదారి పట్టాయని ఆరోపించారు. వాటిని నివారించడానికి ఈకెవైసీ అప్ డేట్ చేసి బియ్యాన్ని అర్హులై వారికే అందజేసేలా చర్యలు తీసుకొంటుందన్నారు.ఇప్పటివరకు అప్ డేట్ చేయించుకోలేనివారు వివరాల ప్రకారం రేషన్ డీలర్ వద్ద, వాహానం వద్ద ఈపాస్ యంత్రంలో వేలిముద్రవేసి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు,65ఏళ్లు దాటినవార్కి డోర్ డెలివరీ ఉంటుందని పేర్కొన్నారు.