

జనం న్యూస్ మే 25,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఈ రోజు తో ముగిసింది. ఈ రోజు జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి, శిక్షణ శిభిరం పర్యవేక్షణ చేసి ఉపాధ్యాయులు అంకిత భావము తో శిక్షణ లో నేర్చుకున్న అంశాలు వినియోగించు కొని విద్యభివృద్ధికి పాటుపడాలి. ప్రభుత్వ బడిలో నాణ్యత పెంచుకొని, ప్రభుత్వ బదులపై నమ్మకం పెంచి ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి అని సూచించారు. మండల విద్యాధికారి ఉపాధ్యాలందరు పాల్గొని విజవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణ పట్ల, వసతుల పట్ల సంతృప్తి చెందారు. రిసోర్స్ పర్సన్లు కృషి అభినందనీయము.
