

జనం న్యూస్ మే 25(నడిగూడెం)
మండలం లోని వల్లాపురం గ్రామంలో నూతనంగా శ్రీ కంఠమహేశ్వర సురాంబదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 26న మాల ధారణ, 27 హోమం, 28 విగ్రహ ప్రతిష్ఠ, మహా అన్నదానం, 29 కంఠమహేశ్వరుని చరిత్ర కథ, 30 జల గింజలతో అభిషేకం, 31 బోనాలు కళ్యాణం, జూన్ 1న జాతరతో ఉత్సవాలు ముగిస్తున్నట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.