Listen to this article

జనం న్యూస్ మే 27 బీర్పూర్

మండలంలోని తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకుల కు గంజాయి అనార్థాలపై అవగాహన కార్యక్రమం బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు నిర్వహించారు. గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, దాని ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులకు తెలియజేశారు. సెలవులలో దొరికిన సమయాన్ని కంప్యూటర్ శిక్షణ కోసం నియోగిస్తున్నందుకు వారిని అభినందించారు మరియు మంచి అలవాట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు. యువతపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తారని వారికి తెలియజేసి ఎవరు కూడా వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లు కు గురికాకుండా ఉండాలని తెలియజేశారు. ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన, గంజాయి అమ్మిన, కొన్న, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పారు. బీర్పూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656828 కి తెలియపరచాలని చెప్పారు. యువత ముఖ్యంగా ధూమపానం మద్యం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఘంటా పథంగా చెప్పారు.గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.