Listen to this article

ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ జనం న్యూస్ 28మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలొని సన్నరకాల వడ్లను ఏ ఎమ్ సి చైర్మన్, ఏపీఎం మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి వడ్ల తేమ శాతన్ని పరిశీలించి అడిషనల్ కలెక్టర్ తో ఫోన్ లొ మాట్లాడి తెమషాతాన్ని వివరించి డి సి ఎస్ ఓ &డిమ్ తో మాట్లాడి వెంటనే లారీలు పంపించాల్సిందిగా కోరడం జరిగింది.రైతులతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా ధాన్యం తూకం వేయడం ఇబ్బందిగా మారిందని రెండు రోజులలో మండలంలోని అన్ని కేంద్రాలలో ఉన్న దాదాపు ఆరు ఏడు లారీల వడ్లను మిల్లార్లతో మాట్లాడి పంపిస్తామని రైతులు అదైర్యాపడవద్దని మొలకత్తిన రంగుమారిన ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వానిదని ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టాన్ని చేయదని అన్నారు. ఈ కార్యక్రమంలొ ఏ ఎమ్ సి చైర్మన్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ఏపీఎం సమత,మండల ఉపాధ్యక్షులు తడగొండ రాజు మండల ప్రధానకార్యదర్శి మార్కెట్ డైరెక్టర్ చాట్ల విజయ భాస్కర్, ఐయిల్ లేని వంశీధర్ రావు, కొత్తూరి విష్ణు రైతులు తదితరులు పాల్గొన్నారు.