

ఖేడ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె. నూతన్ కుమార్
జనం న్యూస్,మే 27,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎరువుల,విత్తనాల దుకాణాలను ఏడిఎ కె నూతన కుమార్, మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా దుకాణం యజమాని దగ్గర్నుంచి కొనుగోలు రసీదును తప్పకుండా తీసుకోవాలని రైతులకు సూచించారు.ఈసారి వర్షాకాలంలో రుతుపవనాలు ముందుగానే ఆగమనం కావడం సంతోష దాయకం అన్నారు.రైతులు వర్షము 60 మిల్లీలీటర్లు పడ్డ తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలని అన్నారు. విత్తన దుకాణంలో అన్ని రకాల పత్తి విత్తనాలు అన్ని రకాల కంపెనీలు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు.విత్తనాల యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు,సోర్స్ ఆఫ్ సప్లై సర్టిఫికెట్లు ఇన్వైసీలను, ఎక్కడినుంచి వచ్చినవో ఆ యొక్క కంపెనీ ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూటర్ సర్టిఫికెట్లు అన్ని రకాల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎక్కడ నకిలీ విత్తనాలు, లూజుగా దొరికే విత్తనాలు ఇప్పటివరకు ఎక్కడ దొరకలేదు దొరకలేదని అన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ రసీదులు తప్పనిసరిగా తీసుకొని పంట కాలము అయిపోయేంతవరకు భద్రపరుచుకోవాలని అన్నారు.విత్తనాలను, ఎరువులను అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. దుకాణ యజమానులు ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని అన్నారు. అధిక ధరలకు విత్తనాలను అమ్మినచో వారిపై కఠిన చర్యలు తీసుకొనడమే కాకుండా లైసెన్సులను క్యాన్సల్ చేయటానికి పై అధికారులకు సమాచారాన్ని అందిస్తామని అన్నారు. మండలంలోని తడ్కల్, కంగ్టి లోని పలు దుకాణాలను తనిఖీ నిర్వహించారు.డీలర్లు
ఈపాస్ మెషిన్ ద్వారా మాత్రమే ఎరువులు రైతులకు ఇవ్వాలని, రైతులు ఎరువులు తీసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకొని ఎరువులు తీసుకోని వెళ్లాలని అన్నారు. దుకాణదారులు ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం, ఈపాస్ మెషిన్లో నమోదు చేయడం స్టాక్ బోర్డు రాయడం తప్పనిసరి అని అన్నారు.అధిక ధరలకు అమ్మిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.రసీదులు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని దుకాణ యజమానులకు తెలిపారు. ఏ డిఏపీ అయినా గాని ఒకటే విధంగా పనిచేస్తుంది. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న స్పీక్ డిఏపి ని కాకుండా అన్ని రకాల డిఎపి ఒకటే విధంగా పనిచేసి మొక్క ఎదుగుదలకు పని చేస్తుందని అన్నారు.ఇది రైతు సోదరులు గమనించి అందుబాటులో ఉన్న డిఏపి ని మాత్రమే వాడుకోవాలని అన్నారు.డీలర్లు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పురుగు మందులను రైతులకు అందించాలని సూచించారు.ఎవరైనా నాసిరకం విత్తనాలు, ఎరువులు పురుగు మందులను అమ్మిన, తెచ్చిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాని అన్నారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు,రైతు సోదరులు, పాల్గొన్నారు.