Listen to this article

జనం న్యూస్ మే 27 (నడిగూడెం)

ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఎంపీడీవో హరిసింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. మంగళవారం కరివిరాల లో పని చేస్తున్న ఉపాధి కూలీల హాజరును,నర్సరీని, చెన్నకేశవాపురం గ్రామంలో సెగ్రికేషన్ షెడ్ ను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ
మండలంలోని సెగ్రి కేషన్ షెడ్లను ఉపయోగంలోకి తేవాలని,గ్రామాలలో తడి,పొడి చెత్తను సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్వర్, టిఎ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉషారాణి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.