

జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:- ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డ్ లకు సంబంధించిన వార్డ్ సభ నందు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాల పై వార్డ్ సభ ను నిర్వహించి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ హాజరయ్యారు.
ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కౌన్సిలర్స్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు..ఎమ్మెల్యే కౌన్సిలర్ గజమాల తో ఘనంగా సత్కరించారు..ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల లో ఇచ్చిన లను ఆరు గ్యారెంటీల లో ఇప్పటికే ఫ్రీ బస్సు , 500 రూపాయల సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ కరెంటు, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.ఈనెల 26వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలకు ప్రారంభించడం జరిగింది ఇందులో రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మరియు రేషన్ కార్డులు పథకాలను అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి వార్డ్ లో సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోని గతంలో వార్డ్ సభలో నమోదు చేసుకోలేని వారికి మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది. వార్డ్ సభ లో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. అదేవిధంగా వార్డ్ అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా త్వరలోనే ఇండ్లను నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది తెలిపారు.అలాగే రేషన్ కార్డు లను కూడా అర్హులైన వారికి ఎంత జరుగుతుంది కొత్తగా వివాహం చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డును అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి రేషన్ కార్డు రానివారు మరొకసారి ఈ ప్రజా పాలనలో గ్రామసభ నందు నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరగా రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా గతంలో గత ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్ రూమ్ లో డిప్పు ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలలో వారికి కూడా ప్రభుత్వం ఇండ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఎవరు అధైర్యపడవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను జనవరి 26 తేదీ నాడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతులకు, రైతు భరోసా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం గ్రామసభలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలి అదేవిధంగా కొన్ని గ్రామాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని వెంటనే అధికారులు పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలలో అవకాశం కలిపించి ఇందిరమ్మ ఇల్లు లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కృషి చేయాలి అని కోరారు.గద్వాల పట్టణంలో ప్రతి వార్డ్ లో వార్డ్ సభ లో ప్రజాల పాలన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల కొరకు నమోదు చేసుకోలేని వారు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సభ్యులను తీసుకొని నమోదు చేసుకోగలరు వారికి కూడా త్వరలో ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వం సహాయశక్తుల కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డును జారీ చేయడం జరిగింది. రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు నమోదు కావడం జరిగింది ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాలేదని నమోదు చేసుకోలేదని పరిస్థితి ఉంటే వారి గ్రామసభలో కూడా నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరలో రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని బట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్లలో కూడా నిజమైన నిరుపేదలకు నివాసం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలు 3500 కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు లేని వారికి, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , మొదటి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది
ప్రజలందరూ వార్డులో నమోదు చేసుకోవడం వీలు కాని వారు మున్సిపాలిటీ కార్యాలయం నందు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో ప్రజలు సంక్షేమ పథకాల సంబంధించిన దరఖాస్తులను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రతి వార్డ్ ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ కలెక్టర్ నర్సింగ్ రావు , మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్స్ మురళి, శ్రీను, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆంజనేయులు, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు సుదర్శన్ , గోవిందు, ధర్మ నాయుడు, మోబిన్, తుమ్మల నర్సింహులు, గువ్వల గోపాల్, కొత్త గణేష్, మోహన్ యాదవ్, గాంధీ, వీరేష్, రాము, ఫయాజ్, రాజు, మొహియుద్దీన్, కిరణ్, పరశురాముడు, రామచందర్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.