

ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
జనం న్యూస్ మే 29
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 60 లక్షల రూపాయల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ముత్తంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో గల గదులు శిథిలావస్థకు చేరుకోవడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు గతంలో తమ దృష్టికి తీసుకొని వచ్చారని ఆయన తెలిపారు. అమెరికాకు చెందిన మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు 60 లక్షల రూపాయలతో తరగతి గదులు నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లోనే పనులు ప్రారంభించి.. తరగతి గదులను అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పారు. గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నరసింహారావు, మేరాజ్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.