Listen to this article

జనం న్యూస్ మే 28 (నడిగూడెం)

మండలం లోని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా.. ప్రత్యేక అధికారులు, గ్రామ కార్య దర్శిలు ఏ మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలొస్తున్నాయి.