

జనం న్యూస్,మే29,
అచ్యుతాపురం:విద్యుత్ నిర్వహణ పనుల్లో భాగంగా పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 11కెవి ఫీడర్ పరిధిలోని వెస్ట్రన్ సెక్టార్ ఇండస్ట్రియల్ ఏరియా,బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా,చిప్పాడ,పూడిమడక, కడపాలెం,జాలరి పాలెం,కొండపాలెం,సీతాపాలెం,బార్క్,ఐఓసిఎల్,ఐటెక్, అభిజిత్ ఐఆర్ఈఎల్,ఏపీఐఐసీ వాటర్ ట్యాంక్,ఆర్సిఎల్ వెస్ట్రన్ సెక్టార్ ఇండస్ట్రియల్ ఏరియా,వన్ స్టాప్ బిల్డింగ్
తదితర ప్రాంతాలలో 30వ తేదీ శుక్రవారం ఉదయం 9గంల నుంచి సాయంత్రం 5 గంల వరకు
విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యను గుర్తించి వినియోదారులు తమకు సహకరించాలని ఏఈ కోరారు.