Listen to this article

జనం న్యూస్ మే 30 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

అమెరికా డెలావర్ లో జూన్ ఒకటో తారీకు డలాస్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సన్నాహక్క వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, గాదరి కిషోర్, క్రాంతి కిరణ్ చంటి, పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గ్యదారి బాలమల్లు తో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బాల్క సుమన్ మరియు పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారని అన్నారు కెసిఆర్ ని మళ్లీ మన ముఖ్యమంత్రిగా ఎన్నుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. డలాస్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ మరియు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి ఎన్నారై సోదరులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ పిన్న, అనుదీప్ దిద్ది, ప్రమోద్ చెవ్వ, మరియు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.