Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్

జనం న్యూస్ 31 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కొత్తవలస మండలం మంగళపాలెంలో రాపర్తి జగదీష్ బాబు ఇంటిలో ఇటీవల జరిగిన చోరీ కేసులో నేర స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు మే 30న సందర్శించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నేర స్థలాన్ని సందర్శించి, నేరం జరిగిన తీరును పరిశీలించారు. నేరస్తులు ఏవిధంగా ఇంటిలోకి ప్రవేశించారన్న విషయాన్ని పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ నేర స్థలాన్ని పరిశీలించి ఏమేమి ఆధారాలు సేకరించినది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. నేర స్థలాన్ని పరిశీలించిన తరువాత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశమై కేసును చేధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవలంభించాల్సిన విధి విధానాల గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశించారు. చోరీ మిస్టరీని చేధించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, కొత్తవలస సిఐ షణ్ముఖరావు, ఎస్.కోట సిఐ వి.నారాయణ మూర్తి, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, ఎస్ఐ లు సుదర్శనరావు, నవీన్ పడాల్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.