

జనంన్యూస్. 31. నిజామాబాదు. సిరికొండ.
రైతంగా వ్యతిలేక నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలి
సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్
నిజామాబాదు. రూరల్. సిరికొండ. మండలం…
రైతాంగం పట్ల కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సిగ్గు చేటని,రైతంగా వ్యతిలేక నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ అన్నారు. శనివారం నాడు సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో అఖిల భారత ఐక్యరైతు సంఘం(ఏఐ యూ కేఎస్.) సభ్యత్వం నమోదు కార్యక్రమంను ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్రప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతుంది అని రైతుల పట్ల చిన్న చూపు చూపుతుంది అని అన్నారు
వ్యవసాయ రంగాన్ని ఆదాని లాంటి కార్పొరేట్ల కు అప్పగించడానికే రైతువ్యతిరే నూతన చట్టాలను తీసుకోచ్చారు అన్నారు. స్వామీనాథన్ కమిషన్ సూచనలు తుంగలోతోక్కి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు. ఎం ఎస్ పి చట్టం కు చట్టబద్ధత కల్పించి అమలు చేస్తాం అని ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తే వ్రాత పార్వకంగా హామీ ఇచ్చి ఇప్పుడు ఎగనామం పెట్టారు అన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు దాసోహం ఆయి రైతులను బలి పశువు చేస్తున్నారు అన్నారు. రైంహంగం కేంద్రం ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపును ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ జిల్లా,డివిజన్ నాయకులు బి. కిషోర్, ఆర్. దామోదర్, మండల నాయకులు ఎం. లింబాద్రి, ఇ. రమేష్, ఎస్ కిశోర్, టీ. భూమాగౌడ్, జి. లింబాద్రి, జి. ఎర్రన్న, తదితరులు పాల్గొన్నారు.