

జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. 2025 దశాబ్ది ఉత్సవాలు 27/05/2025 నుండి జిల్లాలో ప్రారంభించపడినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగదాస్ తెలిపారు. ఇందులో భాగంగా హరితయోగం, యోగ సమావేశం, యోగ ప్రచారం నిర్వహించబడినవి ఇందులో భాగముగా ఈ రోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ లో యోగ ద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి,కోపం, డిప్రెషన్, యోగ ప్రాణాయామం చే ఎలా నియంత్రించుకోగలం వివరించి ప్రాణాయామ విధులు ఆసనాలు, యోగ ప్రాముఖ్యత గురుంచి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శివప్రసాద్ గారు మాట్లాడుతు యోగ యొక్క ప్రాముఖ్యత, శారీరక మానసిక రుగ్మతల పై ప్రతి రోజు యోగ ఆసనాలు,ప్రాణాయామం,ద్యానం వలన నిద్ర లేమి మానసిక కుంగుబాటు,ఆవేశం మొదలైన వాటిని నియంత్రించవచ్చు అని వివరించారు. ఈ కార్యక్రమంలో యోగ వైదులు డాక్టర్ తిరుపతి యోగ ఆసనాలు,ప్రాణాయామం, యోగ శిక్షకుల ఆధ్వర్యంలో వేయించడం జరిగింది మరియు ఆయుష్ ఫార్మ సీస్ట్ లు పురుషోత్తం, ఉమ్యాప్రసాద్, నీరజ యోగ శిక్షకులు విజయ భాస్కర్, రాజేందర్, నమ్రత, సంగీతా మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.