

మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి
మద్నూర్ మే 31 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ను జూన్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా మద్నూర్ మండలంలోని 23 గ్రామాలలో భూభారతి రైతు సదస్సులను నిర్వహిస్తున్నట్లు జూన్ మూడవ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రామాల వారిగా ఈ సదస్సులు నిర్వహిస్తునట్లు మద్నూర్ మండల తాసిల్దార్ ఎం.డి ముజిబ్ గారు తెలిపారు. భూమి హక్కులలో (పాసు పుస్తకం లో పేర్లు తప్పుగా నమోదు అయిన, భూ విస్తీర్ణం తప్పుగా నమోదు అయిన, భూమి ఇతర వారి ఖాతా లో తప్పుగా నమోదు అయిన , పైన తెలిపిన వాటిలో తప్పులు ఉన్నట్లు అయితే రికార్డులు పరిశీలించి వాటిని సరి చేయడానికి ధరఖాస్తు స్వీకరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు రికార్డు లలో నమోదు చేసుకోవడానికి చట్టం వచ్చిన నాటి నుండి సం ” లోపు ధరఖాస్తూ చేసుకోవాలి. పెండింగ్ సాదా బైనామా ధరఖాస్తుల పరిష్కారం. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమి పై హక్కులు సంక్రమిస్తే వాటిపై విచారించి పరిష్కారం చేస్తారు . నిషేధిత జాబితా భూమిలో (POT Act.) అసైన్డ్ భూములలో ఇప్పటికే భూమి హక్కులు పొంది, ఏమైనా తప్పుగా నమోదు అయిన, రికార్డులలో నమోదు కానీ, సమస్యలు ఉంటే వాటిపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు . సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్ అవార్డ్, అసైన్డ్ మెంట్ పట్టా, 38ఈ సర్టిఫికెట్, 13బి సర్టిఫికెట్, ఓ. ఆర్. సి, సేల్ సర్టిఫికెట్ మొదలగు వాటి ద్వారా హక్కులు సంక్రమిస్తే వాటిని పరిశీలించి రికార్డు ల ప్రకారం ఉన్నట్లు అయితే పరిష్కరిస్తారు. భూమి పట్టా దారుకు రికార్డు లలో ఉన్న దానికంటే తక్కువగా నమోదు అయినట్లు (Extent) అయితే దాన్ని సరి చేయుటకు దరఖాస్తు తీసుకుంటారు. పైన పేర్కొన్న అంశాల వారిగా గ్రామాలలో జరిగే భూభారతి రైతు సదస్సులలో దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని , ఈ సదస్సులను మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గారు కోరారు.
జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండలంలోని 23 గ్రామాలలో భూభారతి రైతు సదస్సులు రెండు బృందాలుగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.