Listen to this article

జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలోని పూల్‌బాగ్‌లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి నుంచి దాసన్నపేట రైతుబజార్‌కి కూరగాయల లోడుతో వస్తున్న ఆటోను కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న రైతులు స్వల్పంగా గాయపడ్డారు. టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.