

జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ప్రజలకు దైర్యం కలిగించడం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు సీపీ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల లోని పాత సి ఎం ఎస్ గౌడౌన్స్ నుండి అంబేద్కర్ కూడలి మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ పహాల్గాం ఘటన ద్వారా దేశ ప్రజలలో అలజడి రేగినప్పటికి ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం సాధించి ఆత్మ విశ్వాసం చాటడం జరిగిందన్నారు తాము ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఎఫ్ సరస్వతి శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేష్ ఆత్మకూరు సీఐ క్రాంతి కుమార్ ఎస్సైలు సంతోష్ శివ కుమార్ రమేష్ అశోక్ తిరుపతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…