Listen to this article

యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి

యువత అసాంఘిక శక్తులకు దూరముగా ఉంటూ మంచిని మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలి

ఎస్సై ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ జూన్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలని ఆదివారం మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా భవిష్యత్‌పై దృష్టి పెట్టాలన్నారు.దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత అన్ని విద్యార్ధులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్ధాయిలో నిలిచి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు.యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడిచి తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు.యువకులు గంజాయి,మద్యం,జూదం వంటి చెడు వ్యసనాలకు,ఇతర చెడు మార్గాల వైపు‌ దృష్టి మరల కుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి,తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి,జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్సై సూచించారు. గ్రామంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే గ్రామంలో పది మంది తన వెంట వస్తారని అన్నారు.అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘవిద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు.వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు యువత పాటు పడాలని ఎస్సై సూచించారు.