

రేషన్ డిపోల్లో సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూన్01,అచ్యుతాపురం
:ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో నేటి నుండి డిపోల ద్వారా రేషన్ కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోనున్నారు. అందులో భాగంగా ఈరోజు అచ్యుతాపురం మండలం వెదురువాడ గ్రామంలో రేషన్ డిపోను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించి కార్డుదారులకు సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం,నిత్యావసర సరుకుల విషయంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పంపిణీ జరగాలని,రేషన్ డిపోలు ద్వారా ఒకటో తేదీ నుంచి 15 వరకూ సరుకులు అందజేయనున్నారని, ఉదయం 8 నుంచి 12 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ డీలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.