Listen to this article

ప్రతినెలా 1 నుంచి 15 వరకు రేషన్ దుకాణాలలో రేషన్ ..

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు..

వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ

గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు..

ఎండియు ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చాం.. వారి ఉపాధికి ఎటువంటి ఇబ్బంది లేదు..

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట్ సుబ్బారావు

65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, రేషన్ దుకాణాలకు రాలేని వారికి ఇంటి వద్దనే రేషన్ అందించడం జరుగుతుందని టిడిపి పట్టణ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ పేర్కొన్నరు చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్ డీలర్ దేవీ చక్రపాణి రేషన్ దుకాణాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ..జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతినెల 1 నుంచి 15 తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని.. లబ్ధిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు అన్నారు. గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇవ్వడం మూలంగా.. ఎండియూ ఆపరేటర్లు ఏ సమయంలో తమ వీధిలోకి వస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు తమ వీధిలోకి వచ్చిన ఎండలో నిలుచుని రేషన్ తీసుకోవలసిన పరిస్థితి ఉండేదన్నారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారన్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, ప్రజలు వారి తీరిక సమయంలో రేషన్ తీసుకోవడానికి వీలుగా తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎండియు ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చామని వారి ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు రూరల్ లో మొత్తం 58 చౌక దుకాణాలు ఉన్నాయని .. వీటి ద్వారా 34,738 మంది లబ్ధిదారులు రేషన్ పొందనున్నారన్నారు. వీరిలో 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగులు 5531 కార్డులు ఉన్నాయన్నారు.. వీరందరికీ ఇంటి వద్దనే రేషన్ అందిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీరిక సమయాలలో వెళ్లి రేషన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. తెలియక లబ్ధిదారులు రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తిరిగి రేషన్ దుకాణాలను పునః ప్రారంభించే దిశగా చర్యలు ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించడానికి రేషన్ డీలర్లు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్నారు. రేషన్ షాపులలో ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని బరువులో తేడా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు ధరల పట్టిక కూడా సంబంధిత షాపుల బయటే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం డీలర్ దేవి చక్రపాణి షాపును ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు..