Listen to this article

జనం న్యూస్ జూన్ 2, పరిగి నియోజకవర్గ ప్రతినిధి, (హనుమంత్ రెడ్డి )

పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వారిని, ఆత్మ బలిదానాలు చేసుకున్న వారికి సంతాపం తెలిపి, ఉద్యమకారులను గుర్తుచేసుకొని జెండా ఆవిష్కరించిన, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పరిగి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, మాజీ పిఎసి ఎస్ డైరెక్టర్ హనుమంతు రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.