Listen to this article

జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసిల్దార్ వేణుగోపాల్…..

బిచ్కుంద జూన్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం బిచ్కుంద తాసిల్దార్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బిచ్కుంద మండలం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వేణుగోపాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో గోపాలకృష్ణ ఎంపీడీవో ఆఫీస్ లో జెండా ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ,ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలో, జాతీయ జెండా ను ఆవిష్కరించారు, బిచ్కుంద వ్యవసాయ కార్యాలయంలో ఏవో జాతీయ జెండాను ఆవిష్కరించారు.