Listen to this article

ప్రప్రథమంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం.


జనం న్యూస్,జూన్ 2,జూలూరుపాడు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్) అధ్వర్యంలో ఆవిర్భావ వేడుకాలు ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్) కార్యాలయం నందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక చంద్రశేఖర్ చేతుల మీదగా జాతీయ జెండాను ఆవిష్కంచి,తెలంగాణ తల్లికి జోహార్లు తెలిపార అనంతరం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ,మలిదశ ఉద్యమంలో జర్నలిస్టులు పాత్ర మరువలేనిదని కొనియాడారు.మండల కేంద్రంలో ప్రప్రథమంగా మన ప్రెస్ క్లబ్ ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అదేవిధంగా మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, అటు ప్రభుత్వకి, ఇటు ప్రజలకు వారధిగా ఉండి ప్రభుత్వం దృష్టికి జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్ ) తరుపున ప్రజల సమస్యలను తీసుకువెళ్ళి,సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేపట్టిన తోటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ,కమిటీ సభ్యులు సమిష్టి కృషితో, సమష్టి నిర్ణయాలతో ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బాపట్ల మురళి,గుండా సత్యనారాయణ, చాపలమడుగు నరసింహారావు,తంబర్ల పుల్లారావు,నల్లగట్ల దిలీప్ కుమార్,షేక్ బుడెన్ పాష,ఉసికల రమేష్,అన్నవరపు జస్వంత్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.