Listen to this article

బలరాం నాయక్ సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

కొత్తగూడెం నియోజకవర్గం 02 జూన్ ( జనం న్యూస్)

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెంలో 1969 ప్రత్యేక తెలంగాణ సమితి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జండా ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన సింగరేణి సీ & ఎండి డి బలరాం నాయక్ . 1969 ప్రత్యేక తెలంగాణ సమితి ఆ సంఘ కార్యదర్శి కే జి ఎస్ మ్యాచ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో గల చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాం నాయక్ హాజరైనారు . అనంతరం ఆ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో వీరంతా కూడా వారి ప్రాణాలను లెక్కచేయకుండా ఈ పోరాటంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడుటలో కొత్తగూడెం జిల్లాలో జరిగిన కాల్పుల్లో అమరులైన రామచందర్, దస్తగిరి లను గుర్తుచేసుకొని నివాళులర్పించారు . రానున్న రోజుల్లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన వీరందరికీ ప్రభుత్వం నుంచి రావలసిన ప్రతి ఫలాలు వీరందరికీ అందేలా ప్రతి ఒక్కరు వరకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీ ఎస్ మాథ్యూస్ , ఎండి గౌస్ , ఎన్ మంగపతి, జి లక్ష్మీనారాయణ, పి వీర స్వామి , కే కొమరయ్య , పి రామచందర్ , ఎన్ కామేశ్వరరావు మరియు ఆ సంఘ సభ్యులు పాల్గొన్నారు.