Listen to this article

జనం న్యూస్,జూన్02,అచ్యుతాపురం:

మండలం లోని పూడిమడక గ్రామంలో లైట్ హౌస్ కు వెళ్లే రోడ్డు పై పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో సోమవారం తొలగించడం జరిగింది అని,వాహనాలు ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా..అక్కడకక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తున్నారని, చెత్తను తీసుకుని వెళ్లే వాహనాలు పైన చెత్త వేయడం ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామని
సర్పంచ్ చేపల సుహాసిని వెంకటరమణ తెలిపారు. రోడ్డు వెంబడి చెత్త చెదారం ఉన్న
పరిసరాలను శుభ్రం చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.