

జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయని SFI నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై SFI నాయకులు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు D రాము, Ch వెంకటేష్ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పుస్తకాల వ్యాపారం మొదలుపెట్టి తల్లితండ్రుల నుంచి వేలకు వేలు ఫీజు జలగల్లా కార్పొరేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు ద్వారా మాత్రమే చదువు చెప్పాలని నిబంధన ఉన్నా సరే అనేక పాఠశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. ప్రధానంగా అన్ని పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ప్రతీ పాఠశాలలోను పుస్తకాల అమ్మకాలపై నిషేధం విధిస్తూ నోటీస్ బోర్డు లో నోటీస్ పెట్టాలని కోరారు. పుస్తకాలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనే అంశాన్ని అందులో పొందుపరచాలని కోరారు. విద్యాశాఖ అధికారులను పేరెంట్స్ కాంటాక్ట్ అయ్యేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. దానితో పాటు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పుస్తకాల అమ్మకాన్ని నిరోధించాలని కోరుతూ ఇప్పటికే పుస్తకాల అమ్ముతున్న పలు పాఠశాలలపై ఎస్ఎఫ్ఐ నాయకులు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకుంటే విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి( డిఇఓ ) మాణిక్యాల నాయుడు గారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వినతి స్వీకరించిన జేసీ సేతుమాదవన్ గారు ఎస్ఎఫ్ఐ ఇచ్చిన డిమాండ్లు పరిష్కారానికి కృషి చేస్తామని పాఠశాలల్లో పుస్తకాలు అమ్మకాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఆ విధంగా కృషి చేయాలని డిప్యూటీ DEO గారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు J రవికుమార్,జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్ , వంశీ తదితరులు పాల్గొన్నారు.