Listen to this article

వెలిశాల క్రిష్ణమాచారి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు

డైలీవేజీ&ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు


జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజీ&ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లడుతూ గిరిజన శాఖలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్ల శ్రేయస్సు కోసం సిఐటియు సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందని కార్మిక హక్కులు కాలరాయడమే దిశగా సాగుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటికరణ కుట్రలను తిప్పికొడుతూ ప్రభుత్వ సంస్థల రక్షణకై సీఐటీయూ పోరాడుతుందని. అన్నారు. కార్మిక ఐక్య ఉద్యమాలకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని. హాస్టల్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గాల విధానాల మూలాలను వివరిస్తూ రాజకీయ చైతన్యాన్ని కార్మిక వర్గానికి అందించుటకు 2025 జూన్ 9,10 తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఉదయం 9:30 ని,లకు జిల్లా 2 వ మహాసభలు జరగనున్నాయని ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ బి మధు, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజీ&ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి , టేకం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు మరియు బ్రహ్మచారి, రాష్ట్ర కార్యదర్శి మరియు సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ , ముంజం శ్రీనివాస్, లు పాల్గొంటారని తెలిపారు.