Listen to this article


పీడ విరగడై ఏడాది పేరుతో వేడుకలు

జనం న్యూస్,జూన్ 04,అచ్యుతాపురం:


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది..కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.అందులో భాగంగా మునగపాక గ్రామం నందీశ్వరుని ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.తప్పెడుగుల్లు,బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి అరిష్టం పోయి ఏడాది పూర్తి అయిందని,ఐదు కోట్ల ఆంధ్రులు ఊపిరి పీల్చుకున్న రోజు అని, దేశంలో వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు.గత ఐదేళ్లులో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసీపీ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడడంతో వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యిందని,
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినమని జగన్ బయటకు వస్తున్నారని,నరేంద్ర మోడీ, చంద్రన్న పాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నారని,నియోజకవర్గ కూటమి సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, దొడ్డి శ్రీనివాసరావు,కూటమి నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.