Listen to this article

జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


వికసిత భారత దేశపు అమృతకాలం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు కే జగన్నాధపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆవరణలో హెచ్ఎం జి సూర్యకుమార్ వారు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి శ్రీనివాస్ మరియు గ్రామ సెక్రెటరీ కె వెంకన్న గారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జిల్లా యోగ కన్వీనర్ వెంకటేశ్వరరావు బాబీ మాస్టారు మాట్లాడుతూ ప్రకృతి మనపై ఆధారపడదు మనమే పకృతి పై ఆధారపడి జీవిస్తున్నాము కావున మనము ప్రకృతిని కాపాడుకునే అవసరము ఎంతైనా ఉంది పకృతి తలుచుకుంటే ప్రపంచములో మానవాళి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో అనేక సందర్భాల్లో మనం చూసాం కావున ప్రతి పౌరుడు అమ్మ కోసం ఒక మొక్క నాటాలి అనే శ్లోకంతో అందరూ మొక్కలు నాటాలి అన్నారు తర్వాత స్కూల్ డ్రిల్ మాస్టర్ సిహెచ్ సత్యానందం యోగ కన్వీనర్ బాబీ మాస్టారు ఉపాధ్యాయులు పంచాయతీ సిబ్బంది వార్డ్ నెంబర్లు ఉపాధి సేవకులు చేత యోగా కార్యక్రమాలు చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుమర్తి దుర్గారావు వార్డు సభ్యులు శ్రీకాకుళపు రాధాకృష్ణ బల్ల ఆనందం ఫీల్డ్ అసిస్టెంట్ రమణ ఉపాధి హామీ మేట్ లు ఉపాధి సేవకులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు