

జనం న్యూస్, జూన్ 05, అచ్యుతాపురం:
యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహకారంతో అచ్యుతాపురం మండలం ఆవ సోమవారం జంక్షన్లో ఏపీఎస్ఆర్టీసీ వారు రిక్వెస్ట్ బస్ స్టాప్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుండి యలమంచిలి నుండి గాజువాక మరియు గాజువాక నుండి యలమంచిలి రూట్ వెళ్లే (400వై)బస్ లు అవ సోమవారం జంక్షన్లో ఆగుతాయని,ఏపీఎస్ఆర్టీసీ బోర్డు పెట్టి బస్ స్టాప్ ప్రారంభించడం జరిగిందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని స్థానిక నాయకులు కోరారు.చదువుకునే విద్యార్థులు విశాఖపట్నం,ఎలమంచిలి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గమనించి ఎమ్మెల్యేను రిక్వెస్ట్ చేయగా ఆయన స్పందించి రిక్వెస్ట్ బస్సు స్టాపు ఏర్పాటు చేసినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోలా మహేష్,నాగేశ్వరరావు, శిరసపల్లి రమణ,కొల్లి ప్రసాద్,కొలంకి రమణ, ముత్యాలు అప్పలకొండ, బలిరెడ్డి నాగేశ్వరరావు, నందవరపు ఈశ్వరరావు, కోలా రమణ,రాజు, ఈత రమేష్, మొటూరు గోపి, కొండా నూకరాజు, పలివెల రమణ,పాలిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.